Jairam Ramesh: ట్రంప్‌ నుంచి తప్పించుకునేందుకే సదస్సుకు మోడీ దూరం

Arun Chilukuri
Published on: 23 Oct 2025 6:41 PM IST
Jairam Ramesh: ట్రంప్‌ నుంచి తప్పించుకునేందుకే సదస్సుకు మోడీ దూరం
X

Jairam Ramesh: మలేసియాలో జరగనున్న ఆసియాన్ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకావడం లేదు. దీంతో మోడీ లక్ష్యంగా కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నుంచి తప్పించుకునేందుకే ఆయన ఈ సమావేశానికి వెళ్లడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్‌ నేత జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేతిలో చిక్కడం ప్రధాని మోడీకి ఇష్టం లేదని, దీంతో సదస్సుకు గైర్హాజరు అవుతున్నారని ఎద్దేవా చేసింది. అంటే ప్రపంచ నాయకులను ఆలింగనం చేసుకొని ఫొటో తీసుకోవడంతో పాటు తనని తాను విశ్వగురువుగా చాటుకొనే అవకాశం కోల్పోయారని జైరాం రమేష్‌ ట్వీట్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story