నోయిడాలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని శంకుస్థాపన

Noida Airport: నోయిడాలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ భూమి పూజ చేశారు.

Arun Chilukuri
Published on: 25 Nov 2021 3:17 PM IST
PM Modi Inaugurates Noida International Airport
X

నోయిడాలో ఇంటర్నేషల్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని శంకుస్థాపన

Noida Airport: నోయిడాలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ భూమి పూజ చేశారు. 35 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. తొలిదశలో రెండు ప్యాసింజర్ టెర్మినల్లు, రెండు రన్ వేలు నిర్మించనున్నారు. 1,330 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ విమానాశ్రయం సెప్టెంబర్ 2024 నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. మొదటి దశలో, దాదాపు 8,914 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తారు. ఇక్కడ నుండి ఏటా 12 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story