PM Modi: ఉగ్రకుట్రను సహించేది లేదు.. నిందితులను చట్టం ముందు నిలబెడతాం

PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం భూటాన్‌లో పర్యటిస్తున్నప్పటికీ, దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Published on: 11 Nov 2025 12:39 PM IST
PM Modi: ఉగ్రకుట్రను సహించేది లేదు.. నిందితులను చట్టం ముందు నిలబెడతాం
X

PM Modi: ఉగ్రకుట్రను సహించేది లేదు.. నిందితులను చట్టం ముందు నిలబెడతాం

PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం భూటాన్‌లో పర్యటిస్తున్నప్పటికీ, దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూటాన్ పర్యటన సందర్భంగానే ఆయన ఢిల్లీ పేలుడుపై స్పందించారు.

ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు:

"ఉగ్రకుట్రను సహించేది లేదు," అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఉగ్రవాద చర్యలను, దేశానికి వ్యతిరేకంగా కుట్రలను ఉపేక్షించేది లేదని ఆయన గట్టిగా తేల్చి చెప్పారు. "దేశం మొత్తం ఢిల్లీ బాధితులకు అండగా ఉంది," అని పేర్కొంటూ, ఈ క్లిష్ట సమయంలో బాధితులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు.

"కుట్రదారులను వదిలిపెట్టేది లేదు. నిందితులను చట్టం ముందు నిలబెడతాం," అని మోడీ ఉద్ఘాటించారు. ఈ ఘటన వెనుక ఉన్నవారిని ఉపేక్షించబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం వివిధ ఏజెన్సీలు కుట్ర కోణంపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయని ప్రధాని తెలిపారు. పేలుడు ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story