PM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..

PM Modi Addresses Har Ghar Jal Utsav
x

PM Modi: దేశంలో 10 కోట్ల ఇళ్లకు తాగునీరు..

Highlights

Har Ghar Jal Utsav: గోవాలో జరుగుతున్న హర్ ఘర్ జల్ ఉత్సవ్‌కు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు.

Har Ghar Jal Utsav: గోవాలో జరుగుతున్న హర్ ఘర్ జల్ ఉత్సవ్‌కు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా దేశంలో 10 కోట్ల గ్రామీణ కుటుంబాలకు పైపుల ద్వారా స్వచ్ఛమైన నీటి సరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు. ఇంటింటికీ తాగునీరు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఇదొక మైలురాయి అని మోడీ చెప్పారు. ఈ ఘనత సాధించినందుకు ప్రతి ఒక్కరినీ ముఖ్యంగా మహిళలను ఆయన అభినందించారు. హర్ ఘర్ జల్ పథకంలో గోవా మొదటి రాష్ట్రంగా నిలిచిందని మోడీ తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ప్రసంగించారు. పనాజీలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories