ప్రధాని పిలుపుతో కదిలిన యావత్భారతం.. దీప ప్రజ్వలన చేసిన భారతీయులు

ప్రధాని పిలుపుతో కదిలిన యావత్భారతం.. దీప ప్రజ్వలన చేసిన భారతీయులు
x
Highlights

కరోనా మహమ్మారి పై పోరాటానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో యావత్భారతం స్పందించింది.

కరోనా మహమ్మారి పై పోరాటానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో యావత్భారతం స్పందించింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో 9 గంటలకు ముందుగానే తమ ఇళ్లలో లైట్లు ఆపేశారు. వెంటనే మట్టి ప్రమిదలో నూనె ఒత్తులతో కూడిన దీపాలు వెలిగించారు. కొందరు కొవ్వొత్తులు వెలిగిస్తారు మరికొంత మొబైల్ టార్చ్ లైట్స్ ఆన్ చేశారు.

కరోనా వైరస్ పోరాటంలో భారత జాతి మొత్తం ఒక్క తాటిపై ఉందన్న సందేశాన్ని పెద్ద ఎత్తున చాటిచెప్పారు. కొందరు మంత్రాలు పఠిస్తే మరికొందరు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు నెల్లూరు,సహా అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలలో ప్రజలు దీపాలు వెలిగించారు. కరోనపై పోరాటంలో భాగంగా సామూహిక శక్తిని చాటిచెప్పాలని ప్రధాని పిలుపు రాజకీయ, సినీ, క్రీడారంగం కూడా స్పందించింది. ప్రతి ఒక్కరూ దీప ప్రజ్వలన చేసి సోషల్ మీడియాలో తమ ఫోటోలు షేర్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, రజినీకాంత్, పూజా హెగ్డే ,తమన్నా, బ్యాట్మెంటన్ స్టార్ సైనా నెహ్వాల్, పివి సింధు ఇలా ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించారు.













Show Full Article
Print Article
More On
Next Story
More Stories