ఎట్టకేలకు మాజీ సీఎం‌ మెహబూబాకు విముక్తి

ఎట్టకేలకు మాజీ సీఎం‌ మెహబూబాకు విముక్తి
x
Highlights

జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ(60)కి ఎట్టకేలకు విముక్తి లభించింది. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (పిఎస్ఎ) ను జమ్మూ కాశ్మీర్

జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ(60)కి ఎట్టకేలకు విముక్తి లభించింది. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (పిఎస్ఎ) ను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మంగళవారం రద్దు చేసింది, దీంతో దాదాపు 14 నెలలపాటు గృహ నిర్బంధంలో ఉన్న ఆమెకు కు విముక్తి లభించింది. తక్షణమే పిఎస్‌ఎను ఉపసంహరించాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశించడంతో.. మంగళవారం రాత్రి మెహబూబా ముఫ్తీని విడుదల చేసినట్లు జమ్మూకశ్మీర్‌ అధికారులు తెలిపారు. గత ఏడాది ఆగస్టులో కేంద్రం.. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మెహబూబాతోపాటు పలువురు నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అల్లర్లు చెలరేగకుండా ఆ తరువాత ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. ఇక తన తల్లి నిర్బంధంలో నుండి విడుదల కావడం పట్ల ఆమె కుమార్తె ఇల్టిజా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆమె తన ట్వీట్ లో ఇలా పేర్కొన్నారు. 'ఈ కఠినమైన సమయాల్లో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.' ఇల్టిజా అన్నారు. కాగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఒక సంవత్సరానికి పైగా నిర్బంధంలో ఉన్న తరువాత మెహూబాను విడుదల చేసినట్లు విన్నందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories