బిహార్‌లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ

Patna Municipal Officer Demolish Graduate Chaiwali Stall
x

బిహార్‌లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ

Highlights

Bihar: పాట్నాలోని తన టీ స్టాల్‌ను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు

Bihar: బిహార్‌లో గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీగా ప్రసిద్ధి చెందిన ప్రియాంకా గుప్తా కన్నీటి పర్యంతమైంది. తాను జీవనోపాధి కోసం నడుపుతున్న టీ స్టాల్​ను పాట్నామున్సిపల్​ అధికారులు తీసేయడంతో వెక్కివెక్కి ఏడ్చింది. ఈ అంశం మీడియాలోనూ వైరల్​ అయింది. తనకు సాయం చేయాలంటూ ప్రియాంకా గుప్తా.. నేరుగా డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లను కలిశారు. దీంతో వారు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

తేజస్వి యాదవ్​ ఆదేశాల మేరకు ప్రియాంకా గుప్తా టీ స్టాల్‌ను మున్సిపల్​ అధికారులు పునరుద్ధరించారు. ఈ పరిణామంపై 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ' సంతోషం వ్యక్తం చేసింది. బిహార్‌లోని పూర్నియా జిల్లాకు చెందిన ప్రియాంక కామర్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. అయితే నెలల తరబడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. దీంతో ఆమె టీ స్టాల్​ పెట్టాలని నిర్ణయించుకుంది. 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ' పేరిట పాట్నాబోరింగ్ రోడ్‌లో టీ స్టాల్ ఏర్పాటు చేసింది. కొన్ని రోజుల్లోనే ఈ టీ స్టాల్ ఫేమస్ అయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories