No-Confidence Motion: స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. సభలో మొదలైన 10 గంటల యుద్ధం..

No-Confidence Motion: లోక్సభలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. స్పీకర్ ఓం బిర్లా (Om Birla)పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సభలో చర్చకు వచ్చింది.
No-Confidence Motion: లోక్సభలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. స్పీకర్ ఓం బిర్లా (Om Birla)పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సభలో చర్చకు వచ్చింది. మంగళవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావెద్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, దీనిపై చర్చ ప్రారంభమైంది.
10 గంటల సుదీర్ఘ చర్చ:
ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు సభ 10 గంటల సుదీర్ఘ సమయాన్ని కేటాయించింది. విపక్షాలు స్పీకర్ తీరుపై తమ అభ్యంతరాలను లేవనెత్తనున్నాయి. చర్చ ముగిసిన అనంతరం సభలో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. ప్రస్తుత లోక్సభ సమీకరణాల దృష్ట్యా ఈ ఓటింగ్ ఫలితం ఆసక్తికరంగా మారింది.
ప్రత్యేక సభాపతిగా జగదాంబికా పాల్:
స్పీకర్పైనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో, ఆయన అధ్యక్షతన చర్చ నిర్వహించడం సరైనది కాదని విపక్షాలు కోరాయి. దీనికి ప్రభుత్వం అంగీకారం తెలపడంతో.. సీనియర్ ఎంపీ, ఛైర్పర్సన్స్ ప్యానెల్ సభ్యుడు జగదాంబికా పాల్ను ప్రత్యేక సభాపతిగా నియమించారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలోనే సభలో వాడివేడి చర్చ కొనసాగుతోంది.
విపక్షాల ఆరోపణలు:
సభను ఏకపక్షంగా నడుపుతున్నారని, విపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి ఈ నిర్ణయం తీసుకుంది. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం రావడం భారత పార్లమెంటరీ చరిత్రలో అరుదైన పరిణామం కావడం గమనార్హం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



