చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కామెంట్స్‌కు అమిత్ షా కౌంటర్

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కామెంట్స్‌కు అమిత్ షా కౌంటర్
x
Highlights

భారత ఆర్మీ సమరానికి ఎప్పుడూ సర్వ సన్నద్ధంగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఇటీవల యుద్ధానికి సన్నద్ధం...

భారత ఆర్మీ సమరానికి ఎప్పుడూ సర్వ సన్నద్ధంగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఇటీవల యుద్ధానికి సన్నద్ధం కావాలంటూ తమ దేశ సైన్యాన్ని ఆదేశించిన వేళ భారత హోంమంత్రి ఈ కామెంట్స్ చేయడం విశేషం. భారతదేశం ఒక్క అంగుళం భూమి కూడా చైనాకు దక్కనివ్వదని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రతి దేశం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అందుకే ఆర్మీ ఉంటుంది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే ఎదుర్కొంనేందుకే ఆర్మీని ప్రభుత్వం మెయింటెయిన్ చేస్తుందన్నారు. నేను ఎవరి కామెంట్స్‌ను ఉద్దేశించి ఈ మాట అనడం లేదు. కానీ, భారత రక్షణ బలగాలు ఎప్పుడూ రెడీగా ఉంటాయని అమిత్ షా స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories