Nirmala Sitharaman: ఇవాళ, రేపు కర్ణాటకలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా పర్యటన

Nirmala Sitharaman: ఇవాళ, రేపు కర్ణాటకలో పర్యటించనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.

Arun Chilukuri
Published on: 20 Dec 2025 11:29 AM IST
Nirmala Sitharaman: ఇవాళ, రేపు కర్ణాటకలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా పర్యటన
X

Nirmala Sitharaman: ఇవాళ, రేపు కర్ణాటకలో పర్యటించనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. విజయనగర జిల్లాలో పర్యటించనున్న నిర్మలా.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమరావతి పాఠశాలలో విజయపథ్‌ పథకాన్ని ఆమె ప్రారంభిస్తారు. ఇక.. ఇవాళ రాత్రి ఏడున్నర గంటలకు హంపికి చేరుకుని.. అక్కడే బస చేస్తారు.

రేపు ఉదయం హంపి అభివృద్ధి ప్రాధికార కార్యాలయంలో మొక్కలు నాటనున్నారు నిర్మలా సీతారామన్. అనంతరం అనంతపురం విజయపుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్‌ పోలియో కార్యక్రమంలో పాల్గొని.. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో డ్రాప్స్‌ వేయనున్నారు. రేపు రాత్రికి హంపిలోనే బస చేయనున్న సీతారామన్ ఎల్లుండి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story