S Jaishankar: చైనా పట్ల నెహ్రూ ఉదాసీన వైఖరితో వ్యవహరించే వారు

Nehru Was Indifferent Towards China Says S Jaishankar
x

S Jaishankar: చైనా పట్ల నెహ్రూ ఉదాసీన వైఖరితో వ్యవహరించే వారు

Highlights

S Jaishankar: వల్లభాయ్ పటేల్ హెచ్చరించినా... నెహ్రూ పట్టించుకోలేదు

S Jaishankar: చైనా పట్ల భారత మాజీ ప్రధాని నెహ్రూ ఉదాసీన వైఖరితో వ్యవహరించే వారని కేంద్ర మంత్రి జైశంకర్‌ అన్నారు. చైనా విషయంలో నెహ్రూను పలుమార్లు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ హెచ్చరించారని తెలిపారు. బుధవారం ఒక జాతీయ వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా విషయంలో నెహ్రూ అవలంభించిన విధానం బుడగతో సమానమన్నారు. ఆయనకు అమెరికా అంటే కోపమని... అందుకే భారత్‌కు చైనా గొప్ప మిత్ర దేశమైందన్నారు. అప్పట్లో అందరూ దాన్నే నమ్మారని తెలిపారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాకిస్థాన్, చైనా వ్యవహారాలపై నాటి మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినా నెహ్రూ సరైన దృష్టి సారించలేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories