Pulwama Attack Case: పుల్వామా దాడి కేసులో నేడు ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు

Pulwama Attack Case: పుల్వామా దాడి కేసులో నేడు ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు
x

Pulwama Attack (File Photo)

Highlights

Pulwama Attack Case: పుల్వామా దాడి కేసులో నేడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) చార్జిషీట్ దాఖలు చేయనుంది.

Pulwama Attack Case: పుల్వామా దాడి కేసులో నేడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) చార్జిషీట్ దాఖలు చేయనుంది. ఇందులో గత ఏడాది ఫిబ్రవరి 14న జరిగిన ఐఇడి పేలుడులో 40 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది మృతి చెందారని జమ్మూలోని ఎన్‌ఐఏ కోర్టులో మంగళవారం తెలిపింది. జూలైలో ఏడవ నిందితుడు బిలాల్ అహ్మద్ కుచేని ను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ జూలైలో సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే, జూలై 5 ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ ఘటనను "టెర్రర్ అసోసియేట్" గా పేర్కొంది.

ఏజెన్సీ ప్రకారం, హజీబాల్, కాకాపోరా, జమ్మూ కాశ్మీర్ నివాసి అయిన బిలాల్ అహ్మద్ కుచేని తన నివాస స్థావరంలో ఒక సామిల్ నడుపుతున్నాడు. అయితే, అతడు పుల్వామా దాడిలో పాల్గొన్న జైష్-ఎ-మొహమ్మద్ (జెఎమ్) ఉగ్రవాదులతో చేతులు కలపడని అభియోగం. అంతే కాదు, ఈ కేసులో ప్రధాన నేరస్థులు అతని ఇంటిలోనే ఉండిపోయారు, కుచేని వారిని ఇతర కార్మికులకు (OGW లు) పరిచయం చేశాడు. వారు తమ బస, దాడికి ప్రణాళిక సమయంలో సురక్షితమైన గృహాలను చూపించాడు అని సమాచారం.

అతను (జెఎమ్) జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులకు హై-ఎండ్ మొబైల్ ఫోన్‌లను అందించడంతో పాటు వాటిని పాకిస్తాన్ ఆధారిత జెఎమ్ నాయకత్వంతో కమ్యూనికేట్ చేయడానికి, వారి ప్రణాళికకు తుది మెరుగులు దిద్దడానికి, దాడిని అమలు చేయడానికి తమలో తాము ఉపయోగించుకున్నారని ఎన్‌ఐఏ తెలిపింది.. ఇంకా, అతను అందించిన మొబైల్స్‌లో ఒక ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ యొక్క వీడియో క్లిప్‌ను రికార్డ్ చేయడానికి కూడా ఉపయోగించబడింది. ఇది దాడి తరువాత వైరల్‌గా మరీనా విషయం తెలిసిందే..


Show Full Article
Print Article
Next Story
More Stories