Rajasthan: ప్రియుడి మాట విని బిడ్డను సరస్సులో పడేసి చంపిన తల్లి

Rajasthan: ప్రియుడి మాట విని బిడ్డను సరస్సులో పడేసి చంపిన తల్లి
x
Highlights

Rajasthan: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లి తన మూడేళ్ల కుమార్తెను ప్రియుడి మాట విని చంపేసింది.

Rajasthan: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్నతల్లి తన మూడేళ్ల కుమార్తెను ప్రియుడి మాట విని చంపేసింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

అజ్మీర్‌లోని అన్నసాగర్ సరస్సులో బుధవారం ఒక బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి పాల్పడింది స్వయానా ఆ పాప తల్లి అంజలీ సింగ్‌ అని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. పోలీసులు అంజలీ సింగ్‌ను అరెస్ట్ చేశారు.

అంజలి తన భర్తను వదిలేసి, అఖిలేష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే వారిద్దరి మధ్య సాఫీగా సాగే జీవితానికి ఆ మూడేళ్ల కుమార్తె అడ్డుగా ఉందని అఖిలేష్ చెప్పాడు. ప్రియుడి మాటలు నమ్మిన అంజలి ఈ దారుణానికి ఒడిగట్టింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అంజలి రాత్రి వేళ తన కుమార్తెను సరస్సు దగ్గరకు తీసుకెళ్లింది. పాపతో సరదాగా మాట్లాడుతూ, ఆమె నిద్రపోయిన తర్వాత, ఆమెను సరస్సులోకి తోసేసి చంపింది. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories