రేపు మరో వందేభారత్ ట్రైన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

Modi Will Start Another Vande Bharat Train Tomorrow
x

రేపు మరో వందేభారత్ ట్రైన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

Highlights

Modi: ఉదయం 11 గంటలకు జెండా ఊపనున్న మోడీ

Modi: ఏపీ,తెలంగాణ మధ్య మరో వందే భారత్ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలు సేవలందిస్తోంది. ఇప్పుడు రెండో వందే భారత్ ట్రైన్ రానుంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టనున్నారు.

రేపు ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ట్రైన్ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ట్రైన్‌ను మోదీ ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. 8న మోదీ ప్రారంభించినా ఆ రోజు ప్రయాణికులను అనుమతి ఉండదని రైల్వే అధికారులు తెలిపారు. 9 నుంచి వందేభారత్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ట్రైన్ నెంబర్లతో పాటు ఏయే స్టేషన్‌లలో ఆగుతుంది? ఏ స్టేషన్‌కు ఏ టైమ్‌కు చేరుకుంటుంది? అనే వివరాలతో కూడిన షెడ్యూల్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా వెల్లడించింది. మంగళవారం మినహా మిగతా రోజుల్లో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు తిరుగుతుంది. మంగళవారం మెయింటనెన్స్ కోసం ఆపేయనున్నారు.

కొత్త వందేభారత్ ట్రైన్‌కు 20701 నెంబర్‌‌ను అధికారులు కేటాయించారు. సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. మధ్యలో నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలలో మాత్రమే ఈ ట్రైన్ ఆగనుంది.

నల్లగొండకు ఉదయం 7 గంటల 19 నిమిషాలకు, గుంటూరుకు ఉదయం 9 గంటల 45నిమిషాలకు , ఒంగోలుకు ఉదయం 11 గంటల 8నిమిషాలకు, నెల్లూరుకు మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి సికింద్రాబాద్ వచ్చేటప్పుడు ట్రైన్ నెంబర్ 20702గా మారనుంది. తిరుపతిలో మధ్యాహ్నం 3 గంటలా 15నిమిషాలకు బయలుదేరి రాత్రి 11గంటల 45నిమిషాకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

మంగళవారం మినహా మిగతా రోజుల్లో ఈ ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ ట్రైన్ ఛార్జీల వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే బుకింగ్స్‌తో పాటు ఛార్జీల వివరాలను రైల్వేశాఖ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో పొందుపర్చనుంది. ప్రస్తుతం సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రయాణానికి 11 నుంచి 12 గంటల సమయం పడుతుంది. వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వస్తే 9 గంటలు మాత్రమే పట్టనుంది. దాదాపు 3 గంటల ప్రయాణ సమయం తగ్గనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories