Unified Pension Scheme: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్..ఇకపై వారందరికీ ఫుల్ పెన్షన్

Unified Pension Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. దసరా, దీపావళి కంటే ముందే కేంద్ర కేబినెట్ ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 25 Aug 2024 10:01 AM IST
Modi governments gift to employees is the approval of a unified pension scheme
X

New Pension Scheme: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ సర్కార్..ఇకపై వారందరికీ ఫుల్ పెన్షన్

UPS: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం సమావేశం అయిన కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. యూనిఫైడ్ పెన్షన్ కు ఆమోదం తెలిపినట్లు ప్రకటించింది. ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ పథకంలో ముఖ్యమైంది ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంలో 50శాతం పెన్షన్ గా ఇస్తామనే హామీ ఉంది.

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను ప్రవేశపెట్టడం ద్వారా పెన్షన్ వ్యవస్థలో కీలక సంస్కరణకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కొత్త పెన్షన్ స్కీమ్ లో మార్పులు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పెద్దెత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను కేంద్రం తీసుకువచ్చింది.

2000లో అమలు చేసిన ఎన్పీఎస్ గ్యారెంటీ పెన్షన్ మొత్తాన్ని అందించకపోవడం వల్ల చాలా మంది ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత వారి ఆర్ధిక భద్రత గురించి అయోమయంలో పడ్డారు.

అయితే నూతన పెన్షన్ పథకంలో మార్పులు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న వేళ కేంద్ర కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ అధ్యక్షతన ఓ కమిటీని ప్రధాని మోదీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పలు సంస్థలు, దాదాపు అన్ని రాష్ట్రాలతో వందకు పైగా సమావేశాలు నిర్వహించింది.

ఆర్బీఐ, ప్రపంచబ్యాంకు సహా అందరితోనూ సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ ఏకీక్రుత పెన్షన్ పథకానికి కమిటీ సిఫార్సు చేసింది. ఈ పెన్షన్ స్కీమ్ కు కేంద్ర మంత్రి వర్గం శనివారం ఆమోదం తెలిపింది. కాగా ఇది త్వరలోనే అమలు కానుంది.

పాత పెన్షన్ స్కీమ్‌ను ప్రభుత్వం తగ్గించింది:

పాత పెన్షన్‌ స్కీం పైనే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, ప్రపంచ దేశాల్లో ఏయే పథకాలు ఉన్నాయో పరిశీలించి, ప్రజలందరితో చర్చించిన అనంతరం ఏకీకృత పెన్షన్‌ విధానాన్ని ఈ కమిటీ సూచించిందని కేంద్రమంత్రి తెలిపారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

దీనికి సంబంధించి సమాచారం చేరవేస్తూ.."పెన్షనర్లకు 50 శాతం భరోసా పెన్షన్ వస్తుంది. పదవీ విరమణకు ముందు ఏడాదికి సగటు ప్రాథమిక వేతనంలో 50 శాతం ఉంటుంది. ఈ పెన్షన్ 25ఏండ్ల సర్వీస్ తర్వాత మాత్రమే ఉంటుంది. NPS బదులుగా ప్రభుత్వం ఇప్పుడు ఏకీకృత పెన్షన్‌ను ఇస్తుంది, అంటే ప్రభుత్వం ఓపీఎస్‌ను తీసుకువస్తోంది.

నిజానికి ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ పథకం ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి రానుంది. దీని కింద 10 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగంలో పని చేసే వారికి రూ.10,000 పెన్షన్ వారి చేతికి అందుతుంది. 25 ఏళ్లు పనిచేస్తున్న వారికి పూర్తి పెన్షన్‌ ఇస్తామన్నారు. అదే సమయంలో ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే అతని భార్యకు 60 శాతం పెన్షన్ ఇస్తారు.

ఒక ఉద్యోగి 25 సంవత్సరాలు పనిచేసినట్లయితే, పదవీ విరమణకు ముందు గత 12 నెలల సగటు జీతంలో కనీసం 50 శాతం పెన్షన్‌గా ఇస్తారు. NPS వ్యక్తులందరూ UPSకి మారే అవకాశాన్ని పొందుతారు. ఇందుకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.

2004 నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు కూడా ఈ ప్రయోజనం పొందుతారు. రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్‌ను అమలు చేయాలనుకుంటే, దానిని కూడా అమలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story