కరోనా వచ్చినా.. ఇలా ఓటేసిన ఎమ్మెల్యే

Arun Chilukuri
Updated on: 19 Jun 2020 4:43 PM IST
కరోనా వచ్చినా.. ఇలా ఓటేసిన ఎమ్మెల్యే
X

దేశవ్యాప్తంగా 19 రాజ్యసభ స్థానాలకు 8 రాష్ట్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఇది సాయంత్రం 4 గంటల వరకు నడుస్తుంది. సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పది రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 2 రాష్ట్రాల్లో 5 స్థానాలు ప్రతిపక్షం లేకుండా ఎన్నికయ్యాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది.

అయితే అక్కడ రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండడంతో శుక్రవారం ఆయన పీపీఈ కిట్‌ ధరించి తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి భోపాల్‌లోని శాసనసభకు వచ్చారు. క్వారంటైన్‌లో ఉన్న ఆయన పూర్తి ప్రొటక్షన్‌తో రావ‌డంతో సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు.ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు విలువైనదే కావడంతో తప్పనిసరి పరిస్థితిలో ఎమ్మెల్యేలందరూ సభకు హాజరుకావాల్సి ఉంటుంది. వీరికి ఆయా పార్టీలు విప్‌లు కూడా జారీ చేస్తుంటాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story