KTR: నేటి నుంచి కేటీఆర్‌ ఢిల్లీ పర్యటన.. విభజన సమస్యలను కేంద్రానికి నివేదించనున్నమంత్రి

Minister KTR Will Visit Delhi For Two Days
x

KTR: నేటి నుంచి కేటీఆర్‌ ఢిల్లీ పర్యటన.. విభజన సమస్యలను కేంద్రానికి నివేదించనున్నమంత్రి

Highlights

KTR: శంషాబాద్‌ నుండి మహేశ్వరానికి మెట్రో రైలు విస్తరణ.. స్కైవేల నిర్మాణం కోసం కేంద్ర సాయం కోరనున్న కేటీఆర్‌

KTR: మంత్రి కేటీఆర్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. విభజన సమస్యలపై మంత్రి కేటీఆర్ కేంద్రానికి నివేదించనున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. మెట్రోరైలు విస్తరణ, కంటోన్మెంట్ భూములపై చర్చించే అవకాశం ఉంది. అలాగే రాజకీయ వ్యవహారాలపై కూడా ఇద్దరూ నేతలు చర్చించనున్నారు. స్కైవేల నిర్మాణం కోసం మంత్రి కేటీఆర్‌ కేంద్ర సాయం కోరనున్నారు. అయితే ఇప్పుడు షాను కేటీఆర్ కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories