ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం

Arun Chilukuri
Published on: 17 Jun 2020 12:02 PM IST
ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం
X

చైనా బోర్డర్‌లో జరిగిన పరిణామాల మధ్య ప్రధాని మోడీ నివాసంలో.. హుటాహుటిన భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరయ్యారు. అలాగే త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వాస్తవాధీన రేఖ దగ్గర జరిగిన ఘర్షణలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా చైనా దుశ్చర్యను అంతర్జాతీయంగా ఎండగట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి భవిష్యత్తు వ్యూహాలు, కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story