ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో దారుణం.. నక్సల్స్‌ అమరచిన ఐఈడీ పేలుడులో గిరిజన బాలిడికి గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుక చర్య కారణంగా ఒక గిరిజన బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.

Arun Chilukuri
Published on: 10 Oct 2025 12:45 PM IST
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో దారుణం.. నక్సల్స్‌ అమరచిన ఐఈడీ పేలుడులో గిరిజన బాలిడికి గాయాలు
X

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో దారుణం.. నక్సల్స్‌ అమరచిన ఐఈడీ పేలుడులో గిరిజన బాలిడికి గాయాలు

Maoist Atrocity in Chhattisgarhs Bijapur: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుక చర్య కారణంగా ఒక గిరిజన బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నక్సల్స్ అమర్చిన ఐఈడీ (Improvised Explosive Device) పేలుడు సంభవించడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.

బీజాపూర్‌లోని పిడియా అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. పేలుడు కారణంగా తీవ్ర గాయాలపాలైన బాలుడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించేందుకు 85వ బెటాలియన్ సైనికులు సహాయం అందించారు.

మావోయిస్టులు లక్ష్యంగా అమర్చిన ఈ పేలుడు పరికరం కారణంగా, అమాయక గిరిజన బాలుడు బలయ్యాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story