ఎర్రకోట ఘటన..అజ్ఞతంలోకి దీప్ సిద్ధూ

ఎర్రకోట ఘటన..అజ్ఞతంలోకి  దీప్ సిద్ధూ
x

ఎర్రకోట ఘటన..అజ్ఞతంలోకి దీప్ సిద్ధూ

Highlights

ఎర్రకోట ఘటన తర్వాత ఢిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఓ వైపు బోర్డర్ లో రైతు సంఘాలు నిరసనలు తెలుపుతుండగా పోలీసులు ఎక్కడికక్కడ గస్తీ...

ఎర్రకోట ఘటన తర్వాత ఢిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఓ వైపు బోర్డర్ లో రైతు సంఘాలు నిరసనలు తెలుపుతుండగా పోలీసులు ఎక్కడికక్కడ గస్తీ కాస్తున్నారు. నగరమంతా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు స్థానికుల నుంచి కూడా రైతు సంఘాలకు వ్యతిరేకత వస్తోంది. 60 రోజులుగా బోర్డర్ లో నిరసన తెలుపుతున్న రైతులు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవాళ సింఘు బోర్డర్ దగ్గర రోడ్డెక్కిన స్థానికులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. జాతీయ జెండాలు ప్రదర్శించి రైతులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖాళీ కరో సింఘు బోర్డర్ అంటూ ఆందోళన చేశారు. సరిహద్దుల్లో టెంట్లు ఎత్తేయాలని ఢిల్లీ దాటి వెళ్లేందుకు 72 గంటల గడువిస్తూ అల్టిమేటం జారీ చేశారు.

ఇక ఎర్రకోట ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. నిరసనలు తెలుపుతోన్న రైతు సంఘాలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి వెళ్లకుండా వారి పాస్ పోర్టులు సరండర్ చేయాలని ఆదేశించారు. ట్రాక్టర్ ర్యాలీ ఎన్‌వోసీపై సంతకాలు చేసిన రైతు సంఘాల నాయకుల్ని విచారణకు హాజరుకావాలన్నారు. ఇక ఈ వ్యవహరం మొత్తాన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న దీప్ సిద్ధూ అజ్ఞతంలోకి వెళ్లాడు. దాడి జరిగిన అర్ధరాత్రి నుంచి కనిపించకుండా పోయాడు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో అతడిపై అనుమానాలు బలపడుతున్నాయి. చివరి లోకేషన్ హర్యానాలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాడనేది తెలియాల్సి ఉంది. జస్టీస్ ఫర్ సిక్కు సంస్థ రైతలు ధర్నాకోసం విదేశాల నుంచి భారీ ఎత్తున నిధులు సేకరించినట్టు ఎన్ఐఏ దర్యాప్తు లో తేలింది. సింగర్ దీప్ సిద్దూ, దీప్ సిద్దూ తమ్ముడు మణీదీప్ కు ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories