Haryana: హరియాణాలో విరిగిపడిన కొండచరియలు

Landslide in Haryana 10 People Missing | Telugu Online News
x

హరియాణాలో విరిగిపడిన కొండచరియలు

Highlights

Haryana: మైనింగ్ కార్యకలాపాలు జరుగుతుండగా విరిగిపడ్డ కొండచరియలు

Haryana: హర్యానాలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. మైనింగ్ నిర్వహిస్తున్న వాహనాలు ఆ శిథిలాల కింద చిక్కుకున్నాయి. మైనింగ్ కార్యక్రమాల్లో డజన్ల సంఖ్యలో వాహనాలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. భివానీ జిల్లాలోని తోషామ్ బ్లాక్ వద్ద ఉన్న దాదమ్ మైనింగ్ జోన్‌లో ఈ ఘటన జరిగింది. పదుల సంఖ్యలో క్రేన్లు, డంపర్లు, వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి దలాల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories