Kanyakumari Bypolls: ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ?
ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ?
Kanyakumari Bypolls: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ తమిళనాడు నుంచి ఎన్నికల బరిలో దిగాల్సిందిగా ఒత్తిడి పెరుగుతోంది. గతంలో కూడా ప్రియాంక గాంధీని తమిళనాడులోని కన్యాకుమారి లోక్సభ నుంచి పోటీ చేయాల్సిందిగా కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం కోరారు. తాజాగా మరోసారి కార్తి చిదంబరం కాంగ్రెస్ ముందు ఇదే ప్రతిపాదనలు పెట్టారు. కాంగ్రెస్కు సాహసోపేతమైన నిర్ణయం అవసరమన్న కార్తీ.. ప్రియాంక గాంధీని కన్యాకుమారి లోక్సభ నుంచి పోటీ చేయాల్సిందిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
Next Story




