కర్ణాటకలో డ్రగ్స్ కేసు : ఇద్దరు విదేశీయుల అరెస్ట్

కర్ణాటకలో డ్రగ్స్ కేసు : ఇద్దరు విదేశీయుల అరెస్ట్
x
Highlights

కర్ణాటకలో డ్రగ్స్ కేసు : ఇద్దరు విదేశీయుల అరెస్ట్ కర్ణాటకలో డ్రగ్స్ కేసు : ఇద్దరు విదేశీయుల అరెస్ట్ కర్ణాటకలో డ్రగ్స్ కేసు : ఇద్దరు విదేశీయుల అరెస్ట్

ఇప్పటికే కర్ణాటక డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం అయిన విషయం తెలిసిందే. డ్రగ్స్ గుట్టురట్టు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని పట్టుకున్నారు. డ్రగ్స్ తో సంబంధం ఉన్న ఇద్దరు విదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియా దేశానికి చెందిన థామస్, డేనియల్ మత్తు పదార్థాలు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరినుంచి 2.26 కిలోల గంజాయి, ఆరు గ్రాముల కొకైన్, ఒక బైకు, రూ.840 స్వాధీనం చేసుకున్నారు.. మరో నిందితుడు రాజేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరోవైపు బెంగళూరులో కమిషన్ కోసం గంజాయి విక్రయిస్తున్న సత్య అనే యువకుడిని అరెస్టు చేసిన శ్రీరాంపుర పోలీసులు.. అతనినుంచి 15 కేజీల గంజాయి, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరోచోట గంజాయి సరఫరా చేస్తున్న ఆయుబ్ ఖాన్ అనే వ్యక్తిని.. అనేకల్ సమీపంలో పట్టుకొని అతనినుంచి ఏడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అయితే అతన్ని పట్టుకోబోయిన పోలీసులపై కత్తితో దాడి చేసి గాయపర్చడంతో ఇద్దరు పోలీసులు ఆసుపత్రిపాలయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories