Karnataka News: గవర్నర్ కు అభినందనలు తెలిపిన కర్నాటక మంత్రి అశ్వత్ నారాయణ్

Karnataka News: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి సి.ఎన్. అశ్వత్ నారాయణ్ కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలు.

S. Srikanth
Published on: 29 Aug 2020 8:24 PM IST
Karnataka News: గవర్నర్ కు అభినందనలు తెలిపిన కర్నాటక మంత్రి అశ్వత్ నారాయణ్
X

Karnataka News: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి సి.ఎన్. అశ్వత్ నారాయణ్ కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలుకు తీసుకున్న చర్యల గురించి వివరించడానికి గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిశారు. కర్ణాటక NEP ను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా అవ్వాలనుకుంటుంది అని శుక్రవారం సాయంత్రం వారు కలిసినప్పుడు నారాయణ వాలాతో అన్నారు. ఎన్‌ఈపీని ఎలా అమలు చేయాలనే దానిపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ గురించి ఉప ముఖ్యమంత్రి గవర్నర్‌కువివరించారు. ఎన్‌ఈపీ అమలును సులభతరం చేయడానికి రాష్ట్రం చేయబోయే పరిపాలనా, చట్టపరమైన సవరణలను గురించి నారాయణ్ వివరించారు.

టాస్క్ ఫోర్స్ తుది ముసాయిదాను సమర్పించిన వెంటనే అమలు ప్రారంభమవుతుంది. ఇది చాలా త్వరగా జరుగుతుందని భావిస్తున్నాము అని ఆయన అన్నారు. కొత్త విద్యా విధానాన్ని అమలు చేయడానికి తీసుకున్న చర్యలపై వాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రికి తన సలహాలను కూడా ఇచ్చారు వీలైనంత త్వరగా ఎన్‌ఈపీని అమలు చేయడానికి దక్షిణాది రాష్ట్రం అనేక చర్యలు తీసుకుంటోంది. ఎన్‌ఇపి ముసాయిదాను స్వీకరించిన వెంటనే ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ తుది సిఫారసుల కోసం ప్రభుత్వం వేచి ఉంది.

2030 నాటికి ఎన్‌ఈపీ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలనే లక్ష్యంతో రాబోయే మూడేళ్లలో రాష్ట్రం 16 విశ్వవిద్యాలయాలు, 34 అటానమస్ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తుందని గతంలో నారాయణ్ చెప్పారు. పేర్కొన్న లక్ష్యాలను సాధించడానికి కర్ణాటక ప్రభుత్వం 10 సంవత్సరాల గడువును నిర్ణయించిందని.. దీనిని 'టార్గెట్ -2030' అని పిలుస్తుంది అని వివరించారు.


S. Srikanth

S. Srikanth

Next Story