Karnataka: 29 మందితో బసవరాజ్ బొమ్మై కొత్త కేబినెట్

Karnataka CM Basavaraj Bommai Expands New Cabinet
x

Karnataka: 29 మందితో బసవరాజ్ బొమ్మై కొత్త కేబినెట్

Highlights

Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై కేబినెట్ విస్తరణ చేశారు.

Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన బసవరాజ్ బొమ్మై కేబినెట్ విస్తరణ చేశారు. గవర్నర్‌ తావార్‌చంద్ గెహ్లాట్ రాజ్ భవన్‌లో 29 మంది కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్, మాజీ మంత్రులు ఈశ్వరప్ప, ఆర్‌ అశోక, బీ శ్రీరాములు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. కొత్త కేబినెట్‌లో 7 మంది ఓబీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఏడుగురు వొక్కలిగలు, 8 మంది లింగాయత్‌లు, రెడ్డి వర్గానికి చెందిన ఒకరితోపాటు ఒక మహిళకు మంత్రి పదవులు దక్కాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories