Hijab Controversy: నేడు హిజాబ్ వివాదంపై తీర్పు

Judgment on The Hijab Controversy Today | Telugu Online News
x

 నేడు హిజాబ్ వివాదంపై తీర్పు

Highlights

Hijab Controversy: విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన సర్కార్

Hijab Controversy: హిజాబ్ కేసుపై నేడు కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో బెంగళూరులో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా వారం పాటు ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే ఉడిపితోపాటు పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ ఉడిపికి చెందిన పలువురు విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతూరాజ్ అవస్థి నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే వాదనలు వింది. ఇక హిజాబ్, వ్యతిరేక వర్గాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తుండటంతో హిజాబ్ అంశంపై కర్ణాటకలో దుమారం రేగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories