Sasikala: శశికళకు చెందిన 11 ఆస్తులను సీజ్ చేసిన ఐటీ అధికారులు

IT Officials Seize 11 Properties Belonging to Sasikala
x

శ‌శిక‌ళ‌ (ఫైల్ ఫోటో)

Highlights

* తమిళనాడులోని ప‌య్యనుర్‌లో 24 ఎకరాల విస్తీర్ణంలో ఆస్తులు * ఆస్తుల విలువ రూ.100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా

Sasikala: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు ఊహించని షాక్ ఎదురైంది. ఆమెకు చెందిన 11 ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. తమిళనాడులోని పయనూర్ గ్రామంలోని 24 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆస్తులు ఉన్నాయి. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న 1991-1996 మధ్యకాలంలో ఈ ఆస్తులను శశికళ కొనుగోలు చేశారు. ఈ ఆస్తులను కొనుగోలు చేసే సమయంలో వాటి విలువ 20 లక్షల వరకు మాత్రమే ఉండగా.. ఇప్పుడు వాటి విలువ దాదాపు 100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories