
వచ్చే నెలలో భారత పర్యటనకు ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్
Naftali Bennett - India Tour: *మోదీ ఆహ్వానం మేరకు భారత్ వస్తున్న బెన్నెట్ * ఏప్రిల్ 3 నుంచి 5 వరకు బెన్నెట్ పర్యటన
Naftali Bennett - India Tour: ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ వచ్చే నెలలో భారత పర్యటనకు వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బెన్నెట్ ఏప్రిల్ ఏప్రిల్ 3 నుంచి 5 వరకు భారతదేశంలో పర్యటించనున్నారు. గత ఏడాది గ్లాస్తోలో జరిగిన COP 26 సదస్సులో మోడీ-బెన్నెట్ కలుసుకుని పలు అంశాలపై మాట్లాడుకున్నారు. అప్పుడే మోడీ బెన్నెట్ ను భారత్ పర్యటనకు రావాల్సిందిగా కోరారు.
ఇజ్రాయెల్ ప్రధాని హోదాలో భారత పర్యటనకు రావడం బెన్నెట్ కు ఇదే తొలిసారి. భారత్- ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలు 30 సంవత్సరాల పూర్తయిన సంధర్భంగా ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది..వ్యవసాయం, నీరు, వాణిజ్యం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలతో సహా విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు బెన్నెట్ పర్యటన ఉపయోగపడుతుంది.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire