ఎస్పీలో చేరిన ఎత్తైన వ్యక్తి.. దేశంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తి ధర్మేంద్ర ప్రతాప్‌ సింగ్‌..

Indias Tallest man Dharmendra Pratap Singh Joined in Samajwadi Party
x

ఎస్పీలో చేరిన ఎత్తైన వ్యక్తి.. దేశంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తి ధర్మేంద్ర ప్రతాప్‌ సింగ్‌..

Highlights

India's Tallest Man: దేశంలోనే అత్యంత పొడగరి ధర్మేంద్ర ప్రతాప్‌ సింగ్‌ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.

India's Tallest Man: దేశంలోనే అత్యంత పొడగరి ధర్మేంద్ర ప్రతాప్‌ సింగ్‌ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. సమాజ్‌వాదీ పార్టీ విధానాలు, అఖిలేష్‌ నాయకత్వంపై విశ్వాసంతోనే పార్టీలో చేరినట్టు ధర్మేంద్ర ప్రతాప్‌సింగ్‌ తెలిపారు. ధర్మేంద్ర చేరికతో పార్టీ మరింత బలోపేతమవుతుందని సమాజ్‌వాదీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్‌ ఉత్తమ్‌ పటేల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

యూపీలోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన 46 ఏళ్ల ధర్మేంద్ర ప్రతాప్‌ సింగ్‌ దేశంలోనే అత్యంత ఎత్తయిన వ్యక్తి. ఇతడి హైట్‌ 8 అడుగుల 2 అంగులాలు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తికి, ధర్మేంద్రకు కేవలం 11 సెంటీమీటర్లే తక్కువగా ఉన్నాడు. తన పొడవుతో ఇబ్బందులు ఉన్నా ప్రజలు ఫొటో తీసుకుందామని అడిగినప్పుడు సెలబ్రిటీలా ఫీల్‌ అవుతానని ధర్మేంద్ర ప్రతాప్‌సింగ్‌ చెబుతన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories