Afghanistan: అప్ఘానిస్థాన్ లో మళ్లీ చెలరేగిన తాలిబన్లు.. భారతీయులను వెనక్కి పిలిపిస్తున్న కేంద్రం

Indian Embassy in Afghanistan Urges all Indians to Immediately Return
x

Afghanistan: అప్ఘానిస్థాన్ లో మళ్లీ చెలరేగిన తాలిబన్లు.. భారతీయులను వెనక్కి పిలిపిస్తున్న కేంద్రం

Highlights

Afghanistan: అఫ్గాన్‌లో పరిస్థితులు హింసాత్మకంగా మారుతున్నాయి.

Afghanistan: అఫ్గాన్‌లో పరిస్థితులు హింసాత్మకంగా మారుతున్నాయి. తాలిబాన్లకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరులో సాధారణ పౌరులూ బలవుతున్నారు. తాజాగా మజార్‌- ఏ- షరీఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తాలిబాన్లు ప్రకటించడంతో భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ఆ ప్రాంతం, పరిసరాల్లో ఉన్న భారతీయులను వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని సూచించింది.

వారికోసం ప్రత్యేక విమానం అందుబాటులో ఉంచినట్లు చెప్పింది. తక్షణం వెనక్కువచ్చేయమని ట్రావెల్ అడ్వైజరీ గైడ్ లైన్స్ జారీ చేసింది. మజార్‌- ఏ- షరీఫ్‌ అఫ్గాన్‌లోని నాలుగో పెద్ద నగరం. అమెరికా దశల వారీగా తన దళాలను ఉపసంహరిస్తుండటంతో తాలిబాన్లకు, దేశ సైన్యానికి మధ్య భీకర పోరు జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories