చైనాపై వ్యూహాత్మక పైచేయి సాధించిన భారత సైన్యం..

చైనాపై వ్యూహాత్మక పైచేయి సాధించిన భారత సైన్యం..
x
Highlights

భారత సైన్యం పాంగోంగ్ సరస్సు సమీపంలోని ఫింగర్ 4 శిఖరాలను అన్నింటిని స్వాధీనం చేసుకుంది, దీంతో చైనాపై

భారత సైన్యం పాంగోంగ్ సరస్సు సమీపంలోని ఫింగర్ 4 శిఖరాలను అన్నింటిని స్వాధీనం చేసుకుంది, దీంతో చైనాపై వ్యూహాత్మక పైచేయి సాధించింది. ఆగస్టు చివరిలో కార్యకలాపాలను ప్రారంభించిన భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది.. దక్షిణ నుండి పాంగోంగ్ యొక్క ఉత్తర ప్రాంతంలో ఉన్న ఫింగర్ 4 నుండి ఫింగర్ 8 వరకు అనేక శిఖరాల వద్ద చైనా సైనికులు ఉన్నారు. అంతకుముందు చైనా ఇక్కడ ఆధిపత్యం చెలాయించింది, కానీ ఇప్పుడు భారత సైన్యం ఫింగర్ 4 లో ఉన్న ముఖ్యమైన శిఖరాలను స్వాధీనపరుచుకుంది.

మొదట సరస్సు దక్షిణ ప్రాంతంలో భారత సైనికులను ఓడించిన తరువాత , పాంగోంగ్ ఉత్తర ప్రాంతంలో చైనా తన దళాలను క్రమంగా పెంచుకుంది.. కొత్త నిర్మాణాన్ని జరిపడమే కాకుండా.. రవాణా మార్గాలు కూడా ఏర్పాటు చేసుకుంది.. కాని భారత సైనికులు ఈ ప్రదేశానికి చాలా దగ్గరగా ఉండటంతో చైనా యొక్క అన్ని చర్యలపై నిఘా ఉంచారు. దాంతో చైనా దళాలు వెనక్కి తగ్గాయి.

చైనా నిరంతరం సరిహద్దులోని ముఖ్యమైన ప్రాంతాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఆగస్టు 29-30 రాత్రి, పాంగోంగ్ సరస్సుల దక్షిణాన ఉన్న కొండను చైనా దళాలు పట్టుకోవటానికి ప్రయత్నించినప్పటికీ, భారత దళాలు తిప్పికొట్టాయి. అప్పటి నుండి, ఇద్దరి సైనికులు మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 1న చైనా మరోసారి చొరబడటానికి ప్రయత్నించింది.సెప్టెంబర్ 7 న, చైనా దళాలు దక్షిణ ప్రాంతంలోని భారత పోస్టు వైపు కవాతు చేయడానికి ప్రయత్నించాయి.. దీంతో భారత దళాలు హెచ్చరికగా కాల్పులు జరిపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories