భారత్ లో 23.9 శాతానికి కుదించుకుపోయిన జీడీపీ

ప్రపంచ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశం 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ -19 త్రైమాసికంలో..

Raj
By Raj
Published on: 1 Sept 2020 8:18 AM IST
భారత్ లో 23.9 శాతానికి కుదించుకుపోయిన జీడీపీ
X

ప్రపంచ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశం 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ -19 త్రైమాసికంలో రెండవసారి చెత్త ప్రదర్శన నమోదు చేసింది. కరోనావైరస్ సంబంధిత లాక్డౌన్లు, అలాగే తగ్గుతున్న వినియోగదారుల డిమాండ్, పెట్టుబడులపై భారం పెరగడంతో భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (Q1)లో 23.9 శాతం కుదించుకుపోయింది. త్రైమాసిక గణాంకాలు 1996 లో ప్రచురించడం ప్రారంభించినప్పటి నుండి ఇది చాలా ఘోరమైన సంక్షోభం అని ఆర్ధికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలలో చారిత్రాత్మక జిడిపి కోతలకు కారణమైంది. రోజురోజుకు కోవిడ్ -19 కేసులు పెరుగుతున్న కారణంగా భారతదేశంలో పరిస్థితి మరింత దిగజారింది.

ఏప్రిల్-జూన్లో జపాన్ ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం కుదించుకుపోయినప్పటికీ.. చైనా ఈ త్రైమాసికంలో 3.2 శాతం వృద్ధి చెందింది. కరోనావైరస్ మహమ్మారి ఆ దేశంలో గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు జనవరి-మార్చిలో చైనా 6.8 శాతం నమోదు చేసింది. Q4FY -2019-20లో భారత్ 3.1 వృద్ధి చెందింది.

కరోనావైరస్ కారణంగా ఒకప్పుడు ఎక్కువగా ప్రభావితమైన దేశాలలో జర్మనీ ఒకటి, ఈ దేశం 10.1 శాతం జిడిపి తిరోగమనాన్ని నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కెనడియన్ ఆర్థిక వ్యవస్థ 12 శాతం తగ్గింది, అదే సమయంలో ఇటాలియన్ ఆర్థిక వ్యవస్థ 12.4 శాతం కుదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఫ్రెంచ్ జిడిపి 13.8 శాతం తిరోగమనాన్ని నమోదు చేయగా, యునైటెడ్ కింగ్‌డమ్ యూరోపియన్ దేశాలలో అత్యంత దారుణస్థితిలో ఉంది.. Q1 లో జిడిపిలో 20.4 శాతం క్షీణతను చూసింది. GDP contracts by 23.9%: India

Raj

Raj

Next Story