Sikkim: సిక్కింలో వరదల బీభత్సం.. 23 మంది ఆర్మీ జవాన్ల గల్లంతు

Heavy Floods in Sikkim
x

Sikkim: సిక్కింలో వరదల బీభత్సం.. 23 మంది ఆర్మీ జవాన్ల గల్లంతు

Highlights

Sikkim: భారీగా వరదలు పోటెత్తడంతో జవాన్లు గల్లంతు

Sikkim: సిక్కింలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షంతో సిక్కిం అతలాకుతలమవుతోంది. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు పోటెత్తాయి. లొనాక్ సరస్సు దగ్గర ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టితో తీస్తానదికి వరద పోటెత్తింది. దీంతో సిక్కిం లాచెన్ లోయలో ప్రకృతి వైపరీత్యం సంభవించింది. లోనాక్ సరస్సు వద్ద క్లౌడ్ బరస్ట్ తో తీస్తానది ఒక్కసారిగా ఉప్పొంగింది. దీని ప్రభావంతో లోయలో వరద నీటిలో 23 మంది జవాన్లు గల్లంతయ్యారు. తీస్తానది వరదల్లో చిక్కుకున్న 23 మంది జవాన్లు గల్లంతైనట్లు గౌహతి డిఫెన్స్‌ అధికారులు చెబుతున్నారు. వారికోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు. మరోవైపు వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి..ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి..

చుంగ్తాంగ్ డ్యామ్‌ పరీవాహక ప్రాంతంలో కుండపోత కారణంగా 20 అడుగుల మేర వరద ప్రవాహం కనిపించింది. క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా కొన్ని నిమిషాల్లోనే పెను విలయాన్ని సృష్టిస్తూ ఒక్కసారిగా వరద పోటెత్తింది. డ్యామ్ నుంచి వచ్చిన వరద అంతా లాచన్‌ లోయలో ఆర్మీ శిబిరాలను చుట్టుముట్టేసింది. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే క్యాంప్‌ వరదల్లో మునిగిపోయింది. 23 మంది గల్లంతైన జవాన్ల కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఆకస్మిక వరదలు సంభవించాయి. నిన్న రాత్రి కురిసిన కుండపోత వర్షానికి లాచెన్‌ లోయలో గల తీస్తా నది ఉప్పొంగింది. దీంతో 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతైనట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఉత్తర సిక్కింలోని లోనాక్‌ సరస్సు ప్రాంతంలో నిన్న రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో తీస్తా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో చుంగ్‌థాంగ్‌ డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఫలితంగా దిగువ ప్రాంతంలో నీటిమట్టం 15 నుంచి 20 అడుగుల మేర పెరిగింది. దీంతో అర్ధరాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఈ మెరుపు వరదలు సంభవించాయి.

వరదల తీవ్రతకు లాచెన్‌ లోయలోని ఆర్మీ పోస్టులు నీట మునిగాయి. సింగ్తమ్‌ ప్రాంతంలో ఆర్మీ వాహనాలు కొట్టుకుపోయాయి. అందులోని 23 మంది సిబ్బంది గల్లంతైనట్లు ఈస్ట్రన్‌ కమాండ్‌ తెలిపారు. 41 వాహనాలు నీటమునిగినట్లు తెలిపింది. గల్లంతైన సిబ్బంది కోసం గాలింపు ముమ్మరం చేశారు. వరదలు సంభవించిన ప్రాంతంలో ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేదు. దీంతో అక్కడి ఆర్మీ సిబ్బందిని కమాండ్‌ స్థాయి అధికారులు సంప్రదించడం కష్టంగా మారిందని ఆర్మీ అదికారులు తెలిపారు.

ఇక తీస్తా నది ఉగ్రరూపం దాల్చడంతో సింగ్తమ్‌ ఫూట్ బ్రిడ్జ్‌ కుప్పకూలింది. పశ్చిమ బెంగాల్‌, సిక్కింను కలిపే 10వ నంబరు జాతీయ రహదారి చాలా చోట్ల కొట్టుకుపోయింది. మెరుపు వరదలతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులు నీటమునిగాయి. వరదలపై రాష్ట్ర సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమంగ్‌ స్పందించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి.. అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తీస్తా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories