ఘజియాబాద్‌లో బీజేపీ బంధువు దారుణ హ‌త్య‌

ఘజియాబాద్‌లో బీజేపీ బంధువు దారుణ హ‌త్య‌
x
Highlights

భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే బంధువును దుండగులు దారుణంగా కాల్చి చంపిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగింది. మృతుడు తన ఇంటి సమీపంలో ఉదయం..

భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే బంధువును దుండగులు దారుణంగా కాల్చి చంపిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగింది. మృతుడు తన ఇంటి సమీపంలో ఉదయం వాకింగ్ లో ఉండగా ఈ దారుణానికి పాల్పడ్డారు దుండగులు. మృతుడు మురద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే అజిత్ పాల్ త్యాగి బంధువు. ఘజియాబాద్‌లోని సిహానీ గేట్‌లో శుక్రవారం ఉదయం.. బాధితుడు తన రోజువారీ మార్కింగ్ వాక్ లో ఉండగా, ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి ఆయనపై కాల్పులు జరిపారు..

దాంతో ఎమ్మెల్యే బంధువు అక్కడికక్కడే కుప్పకూలారు. అటుగా వెళుతున్న కొంతమంది వ్యక్తులు మృతుడిని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే సంఘటనా స్థలానికి వచ్చారు. ప్రస్తుతం బాధితుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ హత్యకు ఫైనాన్సియల్ గొడవలే అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.. ప్రస్తుతం కుటుంబసభ్యులను విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories