కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదుల హతం

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదుల హతం
x
Highlights

జమ్ముకశ్మీర్‌లో భద్రతాదళాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లా పింజోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని సమాచారం మేర సోమవారం షోపియాన్...

జమ్ముకశ్మీర్‌లో భద్రతాదళాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్‌ జిల్లా పింజోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని సమాచారం మేర సోమవారం షోపియాన్ పోలీసులు సైనికులతో కలిసి గాలింపు చేపట్టారు. సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సైనికులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.

ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు. పింజోరాకు 12 కి.మీ దూరంలో ఉన్న రెబన్‌ ప్రాంతంలో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రసంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను ఆదివారం భద్రతా దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. మృతుల్లో ఓ హిజ్బుల్‌ కమాండర్‌ కూడా ఉన్నాడు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌ సుమారు 12 గంటలపాటు కొనసాగిందని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories