టోల్‌ చెల్లింపుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

టోల్‌ చెల్లింపుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
x

టోల్‌ చెల్లింపుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

Highlights

మీకు కారు ఉందా..? మరి ఫాస్టాగ్‌ తీసుకున్నారా..? ఫిబ్రవరి 15 వచ్చేస్తోంది. ఇక నగదు చెల్లింపులు ఉండవు. బండి ముందుకు పోవాలంటే ఆన్‌లైన్‌లో చెల్లింపులు...

మీకు కారు ఉందా..? మరి ఫాస్టాగ్‌ తీసుకున్నారా..? ఫిబ్రవరి 15 వచ్చేస్తోంది. ఇక నగదు చెల్లింపులు ఉండవు. బండి ముందుకు పోవాలంటే ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిగిపోవాల్సిందే టోల్‌ చెల్లింపులకు ప్రభుత్వం ఫాస్టాగ్‌ తప్పనిసరి చేసింది.

టోల్‌ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలు మినహా ఇతర అన్ని వాహనాలకు టోల్‌ను వసూలు చేస్తోంది కేంద్రం. ఆ టోల్‌ ఫీజు కూడా ఆన్‌లైన్‌ చెల్లింపులే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. 2017 డిసెంబర్‌ నుంచి కొత్తగా రోడ్డెక్కిన ప్రతి వాహనానికి ఫాస్టాగ్‌ తప్పనిసరి చేస్తూ కేంద్ర మోటారు వాహనాల నిబంధనల చట్టం 1989కి సవరణలు చేసింది.

2017 డిసెంబర్‌ కంటే ముందు విక్రయించిన వాహనాలకు 2021 జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి. ఇదే విషయంపై కేంద్రం గతంలో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఫిబ్రవరి 15 వరకు గడువు పొడగించింది. ఇక మంగళవారం నుంచి టోల్‌గేట్ల వద్ద అంతా ఆన్‌లైన్‌ మయమే.

ఫాస్టాగ్‌ ద్వారా ఇంధనం, సమయం ఆదా అవుతాయని కేంద్రం భావిస్తోంది. కానీ ఇప్పటికీ చాలా మంది వాహనదారులు ఫాస్టాగ్‌ తీసుకోకుండానే ప్రయాణం సాగిస్తున్నారు. అలాంటి వారి నుంచి రెండు రెట్లు టోల్‌ ఫీజు వసూలు చేస్తామని కేంద్రం రవాణా శాఖ ప్రకటించింది.

వినియోగదారుల సౌలభ్యం కోసం టోల్‌ప్లాజాల వద్ద పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ వద్ద నగదు రీఛార్జి సౌకర్యం కూడా కల్పించారు. మరీ ఇంకేందుకు ఆలస్యం వెహికిల్స్ ఓనర్లు ఫాస్టాగ్‌ తీసేసుకోండి మరీ.

Show Full Article
Print Article
Next Story
More Stories