ఫాస్టాగ్ ఉండాల్సిందే.. లేదంటే జేబుకు చిల్లు ఖాయం!

Fastag is compulsory
x

తెలంగాణలోని ఓ టోల్ పిలాజా వద్ద వాహనాలు (పాత చిత్రం:హాన్స్ ఇండియా)

Highlights

దేశవ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్‌ నిబంధన పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. అంటే.. మంగళవారం నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులపై టోల్‌గేట్లు...

దేశవ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్‌ నిబంధన పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. అంటే.. మంగళవారం నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులపై టోల్‌గేట్లు దాటాలంటే.. ఫాస్టాగ్‌ తప్పనిసరి. ఒకవేళ ఫాస్టాగ్‌ లేకుంటే.. రెట్టింపు టోల్‌ చెల్లించాల్సిందే. పైగా.. 24 గంటల్లోనే తిరుగు ప్రయాణమైతే ఇచ్చే సగం రాయితీ కూడా లభించదు. ఉదాహరణకు రూ.100 టోల్‌ టాక్స్‌ ఉంటే.. 24 గంటల్లో తిరుగు ప్రయాణమయ్యేవారికి ఫాస్టాగ్‌తో రానుపోను మొత్తం రూ. 150తో సరిపోతుంది. అదే ఫాస్టాగ్‌ లేని వాహనాలకు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి ఈ ఏడాది జనవరి 1 నుంచే ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా.. దాన్ని ఈ నెల 15కు పొడిగించింది. ఇంతకు ముందు ప్రతి టోల్‌ప్లాజా వద్ద ఒక లేన్‌ను నగదు చెల్లింపుల కోసం కేటాయించేవారు.

మంగళవారం నుంచి అన్నీ ఫాస్టాగ్‌ లేన్లే ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలోని జాతీయ రహదారులపై 21 టోల్‌ప్లాజాలున్నాయి. ఫాస్టాగ్‌ గడువును ఇక పొడిగించేది లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆదివారం నాగ్‌పూర్‌లో స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ఇక అవకాశాలివ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లే వాహనాల్లో ఇప్పటికే 90ు ఫాస్టాగ్‌ను వాడుతున్నాయని, మిగతా 10ు వాహనాలకు సోమవారం నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి అని చెప్పారు.

ఫాస్టాగ్‌ ఎక్కడ కొనాలి?

జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఇప్పుడు ఫాస్టాగ్‌ విక్రయాలకు తాత్కాలిక కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వాహనదారులు తమ వాహనం వివరాలు అందజేసి, ఫాస్టాగ్‌ను తీసుకోవచ్చు

ఆన్‌లైన్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలు, ఫోన్‌పే వంటి మనీ వ్యాలెట్‌ సంస్థ కూడా ఫాస్టాగ్‌ విక్రయాలు జరుపుతున్నాయి. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్‌, బీవోబీ, హెచ్‌డీఎ్‌ఫసీ వంటి 21 గుర్తింపు పొందిన బ్యాంకులు వీటిని అందజేస్తున్నాయి. ఆయా బ్యాంకు బ్రాంచీల్లో ఆఫ్‌లైన్‌లో.. లేదా ఆయా బ్యాంకుల యాప్‌లలో ఆన్‌లైన్‌లో ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయవచ్చు

ఫాస్టాగ్‌లో కనీస నగదు నిల్వ ఉండాలనే నిబంధనను కేంద్రం ఎత్తివేసింది. అయితే.. నగదు నిల్వలు లేకుండా ఫాస్టాగ్‌ను వాడితే.. దానంతట అదే బ్లాక్‌లిస్టులోకి మారిపోతుంది. వాహనదారుడు రెట్టింపు టోల్‌ చెల్లించాల్సి ఉంటుంది..

గడువు పొడిగించేది లేదు: నితిన్ గడ్కరీ

ఫాస్టాగ్‌కు సంబంధించిన గడువును పొడిగించేది లేదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టంచేశారు. వాహన యజమానులు వెంటనే ఫాస్టాగ్‌ను తీసుకోవాలని సూచించారు. టోల్‌ప్లాజాల వద్ద ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు ఉద్దేశించిన ఫాస్టాగ్‌ తప్పనిసరి గడువు ఈ నెల 15తో ముగుస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గడువు పొడిగించేదీ లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికే రెండు మూడు సార్లు గడువును పొడిగించామన్నారు. మరోవైపు ఫాస్టాగ్‌ ఈ నెల 15 అర్ధరాత్రి నుంచి (16వ తేదీ) తప్పనిసరి చేస్తూ కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఫాస్టాగ్‌ అమర్చకపోతే సదరు వాహనాకి నిర్దేశించిన దానికంటే రెట్టింపు మొత్తం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories