India: తొలిసారి ఓ మహిళకు ఉరిశిక్ష

Execution of a woman for the first time
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

India: స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఒక మహిళకు ఉరి శిక్ష అమలు చేయబోతున్నారు. ఆమె పేరు షబ్నమ్

India: స్వతంత్ర భారతంలో తొలిసారిగా దేశంలో ఓ మహిళను ఉరి తీయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మహిళకు ఉరిశిక్ష అమలు చేయాలని మథుర కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంత దారుణం ఏం చేసిందంటే.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆ మహిళ పేరు షబ్నమ్. పర్షియన్ భాషలో ఆ పేరుకు అర్థం 'హిమ బిందువు' అని. పేరుకు దగ్గట్టే సుకుమారంగా ఉంటుంది. అందంతో పాటు తెలివితేటలు కూడా ఉన్నాయి. ఒకేసారి ఏడుగురిని హత్య చేసింది. వారంతా ఆమె కుటుంబసభ్యులే. వారిలో అభంశుభం తెలియని ఓ చిన్నారి కూడా ఉండటం విషాదకరం. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో నివసిస్తోంది. ఆమెకు మధురలో ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. అయితే ఉరి ఎప్పుడు అమలు చేయబోతున్నారో ఇంకా తేదీ ఫిక్స్ చేయలేదు

కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే మథురకు చెందిన షబ్నమ్‌ అనే మహిళ సలీం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. షబ్నమ్ ఇంటి పక్కనే ఓ కట్టె కోత మెషీన్ ఉండేది. అందులో సలీమ్ అనే వ్యక్తి కార్మికుడిగా పనిచేసేవాడు. ఆమెకు అతడితో పరిచయం ఏర్పడింది. అనతి కాలంలోనే అది శారీరక సంబంధానికి దారితీసింది. విషయం షబ్నమ్ ఇంట్లో తెలియడంతో కుటుంబసభ్యులు మందలించారు. ఆ యువకుడితో ఎలాంటి సంబంధాలు కొనసాగించవద్దని హెచ్చరించారు. కానీ, షబ్నమ్ పూర్తి విరుద్ధమైన నిర్ణయం తీసుకుంది. సలీంను పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పింది. కట్టె కోత కర్మాగారంలో కూలీగా పనిచేసేవాడికి తమ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్లు ఒప్పుకోలేదు. ఆమెను ఈసారి గట్టిగా మందలించారు. ఎదురుతిరగడంతో గదిలో పెట్టి బంధించారు.

ఆ కోపంతో షబ్నమ్ తన కుటుంబసభ్యులపై కోపం పెంచుకుంది. వారి అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఏంఏ చదివిన ఆమె విచక్షణ కోల్పోయి ప్రియుడితో కలసి రాత్రి భోజనం తర్వాత తాగే పాలలో మత్తు మందు కలిపి, వాళ్లు మత్తులోకి జారుకున్న తర్వాత సలీంతో కలిసి వారందరినీ చంపేసింది. 2008 ఏప్రిల్‌ 14న జరిగింది. అ ఈ దారుణ ఘటన జరిగిన 5 రోజుల తర్వాత షబ్నమ్‌ను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వారిద్దరిపై హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.

వారద్దరినీ జైలుకు తరలించే క్రమంలో వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే షబ్నమ్‌ ఏడు వారాల గర్భవతి అని తేలింది. దీంతో పోలీసులు ఆమెను జైలుకు తరలించారు. కుటుంబ సభ్యులను హతమార్చేలా సలీంను షబ్నమే ప్రోత్సహించిందని తేలింది.

అంతేకాకుండా ఆమె ఎంఏ ఇంగ్లీష్‌, జాగ్రఫీలో పట్టాపొందారు కూడా. కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన మథుర కోర్టు 2010 జూలై 14న నిందితులు ఇద్దరికీ మరణశిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. దీనిని సవాలు చేస్తూ దోషులు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించగా.. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో సలీం, షబ్నమ్‌ 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి ఎదురుదెబ్బ ఎదురైంది. అనంతరం చివరి అవకాశంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముందు క్షమాభిక్షను అభ్యర్థించగా.. ఆయన దానికి నిరాకరించారు. కాగా కాగా బ్రిటిష్‌ ఇండియాలో చివరి సారిగా 1870లో ఓ మహిళకు ఉరిశిక్షను అమలు చేశారు.

ఆమెను ఉరి తీయించడానికి మథుర జైలు అధికారులు ఏర్పాట్లు చేశారు. మీరట్‌కు చెందిన తలారి పవన్ జల్లద్ ఆ మహిళను ఉరి తీయడానికి సిద్ధమయ్యాడు. 2012లో ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ ఘటన దోషులను ఉరి తీసిన తలారి ఆయనే.మహిళ ఉరితీతకు అవసరమైన తాడు కోసం అధికారులు ఆర్డర్ చేశారు. ఇక ముహూర్తం నిర్ణయించి ఉరితీయడమే తరువాయి.. అదే జరిగితే ఆమె.. దేశంలో ఉరికంభం ఎక్కిన తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోనుంది.

భారత్‌లో మహిళలను ఉరి తీయడానికి ఏర్పాట్లు ఉన్న ఏకైక ప్రదేశం 'మథుర జైలు'. దీన్ని 150 ఏళ్ల కిందట నిర్మించారు. బ్రిటిషర్ల పాలనా కాలంలో 1870లో ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. స్వాతంత్య్రానికి పూర్వం అక్కడ ఓ మహిళకు ఉరిశిక్షను కూడా అమలు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 150 ఏళ్ల నాటి ఈ జైల్లో ఇప్పుడు మరో మహిళను ఉరికంభం ఎక్కించడానికి రంగం సిద్ధమైంది. స్వాతంత్య్రం తర్వాత ఉరిశిక్షకు గురైన తొలి మహిళగా షబ్నమ్ వార్తల్లోకి ఎక్కనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories