ఈశాన్య భారతదేశంలో భూప్రకంపనలు
ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సోమవారం మితమైన భూప్రకంపనలు సంభవించాయి. రాత్రి 8.12 గంటలకు మణిపూర్లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. గువహతి, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం లోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రకంపనలు సంభవించాయి.
మణిపూర్లోని కాకింగ్కు నైరుతి దిశలో 11 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఇందులో ఎటువంటి ప్రాణనష్టం గాని ఆస్తినష్టం గాని సంభవించలేదని తెలుస్తోంది.
Next Story




