ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో దుర్గాదేవి మండపంలో అగ్నిప్రమాదం

*షార్ట్ సర్క్యూట్‌ కారణంగా చెలరేగిన మంటలు

Rama Rao
Published on: 3 Oct 2022 10:58 AM IST
Durga Devi Mandapam Fire Incident In Bhadohi Uttar Pradesh
X

ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో దుర్గాదేవి మండపంలో అగ్నిప్రమాదం

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భదోహిలోని దుర్గాపూజ పండల్‌లో రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది . ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 60 మందిపైగా గాయపడ్డారని, వారిని ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. రాత్రి 9.30 గంటల సమయంలో హారతి నిర్వహిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో 300 మంది మండపంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందితో పాటు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ను పరిశీలించారు. క్షతగాత్రులను వారణాసిలోని డివిజనల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఎక్కువమంది చిన్నారులు, మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

కొందరిని సీహెచ్‌సీ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించగా.. మరికొంతమందిని వారణాసికి తరలించారు. షాట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. అగ్నిప్రమాదం వల్ల తొక్కిసలాట జరిగిందని, దీని వల్ల మరింత నష్టం జరిగిందని తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story