Delhi Pollution Crisis: ఢిల్లీలో తీవ్రస్థాయికి చేరిన వాయు కాలుష్యం.. రాజధాని వ్యాప్తంగా గ్రాప్-4 ఆంక్షలు

Delhi Pollution Crisis: ఢిల్లీలో తీవ్రస్థాయికి చేరిన వాయు కాలుష్యం.. రాజధాని వ్యాప్తంగా గ్రాప్-4 ఆంక్షలు
x
Highlights

Delhi Pollution Crisis: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ‌త కొన్ని రోజులుగా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది.

Delhi Pollution Crisis: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గ‌త కొన్ని రోజులుగా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రభుత్వం కఠినమైన గ్రాప్-4 ఆంక్షలను కొనసాగిస్తోంది. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా.. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నీ తప్పనిసరిగా 50 శాతం సిబ్బందితో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిబంధనను ఉల్లంఘించిన కంపెనీలపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.

గ్రాప్-4 ఆంక్షల కింద బీఎస్-6 ప్రమాణాల కంటే తక్కువ ఉన్న.. ఇతర రాష్ట్రాల వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా ప్రభుత్వం నిషేధించింది. అలాగే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపరాదని ఆదేశాలు జారీ చేసింది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతులలో తరగతులు నిర్వహించాలని పాఠశాలలను ఆదేశించారు. ప్రస్తుత ఆంక్షల వల్ల ఉపాధి కోల్పోయిన నమోదిత నిర్మాణ కార్మికులకు.. 10 వేల రూపాయలు పరిహారం అందిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories