ఢిల్లీలో మారణహోమానికి దంపతుల కుట్ర.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఢిల్లీలో మారణహోమానికి దంపతుల కుట్ర.. అరెస్ట్ చేసిన పోలీసులు
x
ఢిల్లీలో మారణహోమానికి దంపతుల కుట్ర.. అరెస్ట్ చేసిన పోలీసులు
Highlights

భారత్‌లో సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిరసనల మాటున ఆత్మాహుతి దాడి చేసేందుకు ఓ జంట కుట్ర చేయగా పోలీసులు భగ్నం చేశారు....

భారత్‌లో సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిరసనల మాటున ఆత్మాహుతి దాడి చేసేందుకు ఓ జంట కుట్ర చేయగా పోలీసులు భగ్నం చేశారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన జహంజేబ్ షమీ, హీనా బేగ్ దంపతులు. జహంజేబ్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. అయితే సోషల్ మీడియాలో భార్యతో కలిసి ఇండియన్ ముస్లిం యునైట్ పేరుతో పేజీ నిర్వహిస్తూ సీఏఏ, ఎన్సార్సీ వ్యతిరేక భావజాలాన్ని ఎగదోస్తున్నట్టు గుర్తించారు.

అంతేకాదు, ఢిల్లీలో మారణహోమం సృష్టించాలని ఆత్మాహుతి దాడికి వ్యూహరచన చేసినట్టు పోలీసులు తెలుసుకున్నారు. వీరిద్దరినీ ఢిల్లీలోని జామియా యూనివర్శిటీ సమీపంలోని వారి నివాసంలోనే అరెస్ట్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఐసిస్ విభాగంతో సంబంధాలు ఉన్నట్లు జహంజేబ్, హీనాలపై ఆరోపణలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories