Delhi : సీఎం ప్రకటన.. మహిళల ఖాతాల్లో రూ.5100 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం

Delhi Budget 2025: Focus on Women Empowerment, Slum Development
x

Delhi : సీఎం ప్రకటన.. మహిళల ఖాతాల్లో రూ.5100 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం

Highlights

Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మంగళవారం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆమె సభలో లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మంగళవారం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆమె సభలో లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో మహిళలకు గౌరవ వేతనం కింద 5,100 కోట్లు కేటాయించారు. ఇందులో మహిళా సమృద్ధి యోజన కింద ప్రతి నెలా 2,500 రూపాయలు అందజేస్తారు. అలాగే, ప్రసూతి పథకం కింద గర్భిణీ మహిళలకు 21,000 రూపాయలు ఇస్తారు. జాతీయ రాజధానిలో మహిళల భద్రత కోసం 50 వేల అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సీఎం రేఖా గుప్తా తెలిపారు.

మహిళా సమృద్ధి యోజనను బీజేపీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని ఢిల్లీ మహిళలకు హామీ ఇచ్చింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకానికి ఆమోదం లభించింది.

సీఎం రేఖా గుప్తా ఇతర ప్రకటనలు

మురికివాడల అభివృద్ధి కోసం ఢిల్లీ ప్రభుత్వం 696 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించిందని సీఎం రేఖా గుప్తా తెలిపారు. ఓట్ల కోసమే ఆమ్ ఆద్మీ పార్టీ మురికివాడలకు వెళ్తుందని, బీజేపీ గురించి భయపెడుతుందని ఆమె ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గత ప్రభుత్వం ఏమీ తీసుకోలేదని, ఎందుకంటే ఆ పథకానికి ప్రధానమంత్రి పేరు ఉందని అన్నారు. ఈ పథకం కోసం 20 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో కేటాయించామని తెలిపారు.

రాజధాని అయినప్పటికీ, జనాభాలో ఎక్కువ భాగం మురికివాడల్లోనే నివసిస్తున్నారని సీఎం రేఖా గుప్తా అన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టినా ఖర్చు చేయలేదని విమర్శించారు. మురికివాడల కోసం 696 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ బడ్జెట్ అభివృద్ధి సంకల్ప పత్రమని అన్నారు. గత ప్రభుత్వం కేవలం ప్రచారం మాత్రమే చేసిందని విమర్శించారు.

కేజ్రీవాల్‌పై విమర్శలు

లండన్‌ను తలపించేలా ఢిల్లీని మారుస్తానని కలలు కన్న ఢిల్లీ యజమాని (అరవింద్ కేజ్రీవాల్) ఢిల్లీని శిథిలమైన రోడ్లు, అసంపూర్ణ ప్రాజెక్టులు, అస్తవ్యస్తమైన రాజధానిగా మార్చారని రేఖా గుప్తా ఎద్దేవా చేశారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కు మెరుగైన కనెక్టివిటీ కోసం కేంద్రం సహాయంతో 1000 కోట్ల రూపాయల ప్రతిపాదన ఉందని రేఖా గుప్తా తెలిపారు. వ్యాపారి సంక్షేమ బోర్డు ఏర్పాటును ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతి రెండేళ్లకు నగరంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories