Delhi: బెంగాల్, అసోంలో తొలిదశ పోలింగ్ ప్రారంభం

Delhi: Assam, West Bengal Election1st Phase poll Begins
x

Delhi:(ఫైల్ ఇమేజ్)

Highlights

Delhi: బెంగాల్ లో 30, అసోంలో 47 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది.

Delhi: ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల్లో భాగంగా శనివారం తొలిదశ పోలింగ్‌ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న పశ్చిమ బెంగాల్‌తో పాటు అస్సాం అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు ప్రారంభమైంది. బెంగాల్‌లో 30, అస్సాంలో 47 స్థానాలకు అంటే మొత్తం 77 అసెంబ్లీ స్థానాలకు తొలిదశలో పోలింగ్‌ జరుగనున్నాయి. కోవిడ్‌–19 కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంది. ప్రతీ పోలింగ్‌ కేంద్రం దగ్గర థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు. శానిటైజర్లు ఉంచారు. పరీక్షలో ఎవరికైనా జ్వరం ఉందని తేలితే వారిని సాయంత్రం ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి తీరాలన్న నిబంధనలున్నాయి. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గం.ల వరకు అక్కడ పోలింగ్‌ జరగనుంది.

అసోంలో...

అసోంలో మొత్తం 2కోట్ల 33లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల ప్రధానాధికారి వెల్లడించారు. వీరికోసం మొదటి దశలో 11,537 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు మొత్తం 50శాతం పోలింగ్‌ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు గస్తీని ముమ్మరం చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. తొలి దశలో భాగంగా మొత్తం 264 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో పోలింగ్‌ సమయంలో కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని ఎన్నికల అధికారులు స్పష్టంచేశారు.

పశ్చిమ బెంగాల్‌లోనూ...

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.32కోట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం ఎనిమిది దశల్లో ఇక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షా వేయి పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొదటిదశ కింద శనివారం 30అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ఆదివాసీలు ఎక్కువగా నివసించే పురులియా, బంకురా, ఝార్‌గ్రాం, తూర్పు మేదినీపుర్‌తోపాటు పశ్చిమ మేదినీపుర్‌ (మొత్తం ఐదు) జిల్లాల్లో శనివారం పోలింగ్‌ జరగనుంది. తొలిదశ ఎన్నికలు జరుగుతోన్న రెండు రాష్ట్రాల అసెంబ్లీ నియోజక వర్గాల్లో రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. పశ్చిమ బెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో భాజపా అగ్రనేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా తదితరులు ప్రచారం నిర్వహించగా, అక్కడి ప్రాంతీయ పార్టీలు కూడా భారీ స్థాయిలో ప్రచారం చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories