Coronavirus : తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు

Coronavirus : తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు
x
Highlights

తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగతున్నాయి. గత రాత్రి 11వున్న కరోనా కేసులు కాస్తా 12కు చేరాయి.

తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగతున్నాయి. గత రాత్రి 11వున్న కరోనా కేసులు కాస్తా 12కు చేరాయి.విశాఖకు చెందిన కరోనా పాజిటివ్‌ ఉన్న రోగి బంధువుకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

దీంతో ఏపీలో కరోనా కేసులు సంఖ్య 12కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 317 మందికి నెగిటివ్‌ అని పరీక్షల్లో తేలింది. మరో 55 మంది నివేదికలు రావాల్సి ఉంది.కరోనా వైరస్‌ మహమ్మారిగా మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా ప్రబలడంతో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాలలో 57 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 45 కేసులు నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్ లో 12 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, కేరళ లో దీని ప్రభావం ఎక్కువగా వుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories