Coronavirus: భారత్ లో మరోసారి పెరిగిన కేసులు..

Coronavirus: భారత్ లో మరోసారి పెరిగిన కేసులు..
x
Representational Image
Highlights

దేశంలో ఇప్పుడు 8,356 కరోనా ఇన్ఫెక్షన్ కేసులు ఉన్నాయి, అలాగే 273 మంది మరణించారు.

దేశంలో ఇప్పుడు 8,356 కరోనా ఇన్ఫెక్షన్ కేసులు ఉన్నాయి, అలాగే 273 మంది మరణించారు.వీటిలో 20% కేసులకు మాత్రమే ఐసియు అవసరమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం నివేదించింది. మిగిలిన 80% కేసులలో చాలా తేలికపాటి సంక్రమణ సంకేతాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు.. అంతేకాదు ప్రస్తుతం 1671 పడకలు అవసరమైతే, మనకు లక్షా ఐదు వేల పడకలు అందుబాటులో ఉన్నాయి. 601 ఆసుపత్రులలో కరోనా పేషేంట్స్ మాత్రమే చికిత్స పొందుతున్నారు. దేశంలోని 40 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లలో కరోనా వ్యాక్సిన్లపై పరిశోధనపై జరుగుతోందని అన్నారు.

ఇదిలావుంటే దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య ఇప్పుడు 8 వేల 844 కు చేరుకుంది. ఆదివారం మహారాష్ట్రలో 148, రాజస్థాన్‌లో 96, మధ్యప్రదేశ్‌లో 52, గుజరాత్‌లో 25, కర్ణాటకలో 11, పశ్చిమ బెంగాల్‌లో 8 మందికి వైరస్ సోకింది. శనివారం, దేశంలో 854 నివేదికలు పాజిటివ్ గా వచ్చాయి. సోకిన వారి సంఖ్య 800 దాటడం ఇది వరుసగా మూడవ రోజు, ఈ గణాంకాలు covid19india.org వెబ్‌సైట్, రాష్ట్ర ప్రభుత్వాల డేటా ప్రకారం ఉన్నాయి.

అదే సమయంలో, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో 8 వేల 356 మందికి వ్యాధి సోకింది. వీరిలో 7 వేల 367 మంది చికిత్స పొందుతున్నారు. 715 మందికి నయమైనవారు ఉన్నారు.. 242 మంది మరణించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories