పాపం మందు బాబు…ఆరు సార్లు ఓటీపీ చెప్పి

పాపం మందు బాబు…ఆరు సార్లు ఓటీపీ చెప్పి
x
Highlights

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలను బంద్‌ చేశారు. దీంతో మద్యం లేక మందు బాబులు విలవిలలాడిపోతున్నారు. మద్యం...

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలను బంద్‌ చేశారు. దీంతో మద్యం లేక మందు బాబులు విలవిలలాడిపోతున్నారు. మద్యం షాపులు మూసివేయడంతో ఆన్ లైన్ అమ్మకాలపై దృష్టి పెట్టారు. ఇదే అదునుగా.. సైబర్‌ క్రైమ్‌ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. లిక్కర్ సరఫరా చేస్తామని నమ్మిస్తూ రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆన్‌ లైన్‌లో మద్యం ఆర్డర్‌ చేసి లక్ష రూపాయలు పొగొట్టుకుంది ఓ జంట. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైలోని చెంబూర్‌కు చెందిన ఓ దంపతులు మార్చి 24వ తేదీన ఆన్‌లైన్‌లో మద్యం కోనుగోలు చేయాలనుకున్నారు.

ఆన్‌లైన్‌లో మద్యం డెలివరీ చేసే వారి కోసం మార్చి 24న గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. ఓ నెంబర్‌ దొరకడంతో మద్యం కావాలని ఫోన్‌ చేశారు. తప్పకుండా మద్యం హోమ్‌ డెలివరీ చేస్తామని చెప్పడంతో.. ఆన్‌లైన్ కొనుగోలు కోసం రూ.3,000 చెల్లించాలని ఓ వ్యక్తి వారిని కోరాడు. దీని కోసం ఓ ఓటీపీ వస్తోందని, అది చెప్పమని అడిగాడు. ఆ వ‍్యక్తి మాటలను నమ్మిన దంపతులు ఓటీపీని వారికి చెప్పారు. దీంతో వెంటనే బాధితుడి ఖాతా నుండి రూ.30,000 కట్ చేసుకున్నాడు. బాధితుడు వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేయగా ఆ మొత్తం పొరపాటున కట్ అయ్యాయని వెంటనే వాపసు చేస్తామని చెప్పాడు. అలా సుమారు ఆరుసార్లు ఓటీపీ కోరుతూ రూ. 1.03 లక్షలు దోపిడి చేశారు. ఆ తర్వాత బాధితుడు కాల్ చేయగా తమకు డబ్బు జమ కాలేదని సరుకుని డెలివరీ చేయలేమని మరొక కార్డు ఉపయోగించి చెల్లింపులు జరపాలని తెలిపాడు. దీంతో కంగుతిన్న ఆ దంపతులు మోసం చేశారని భావించి తిలక్ నగర్ పోలీసులకు మార్చి 27వ తేదీన ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories