Coronavirus: దిల్లీలో ఒక్కరోజే 1163 కేసులు నమోదు..

Coronavirus: దిల్లీలో ఒక్కరోజే 1163 కేసులు నమోదు..
x
Highlights

దేశ రాజధాని దిల్లీలో ఇవాళ ఒక్కరోజే 1163 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18వేలు దాటింది. ఇప్పటి వరకు 416 మంది మరణించారు.కరోనా...

దేశ రాజధాని దిల్లీలో ఇవాళ ఒక్కరోజే 1163 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18వేలు దాటింది. ఇప్పటి వరకు 416 మంది మరణించారు.కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 విధించినప్పటికి కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1163 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 18వేలు దాటింది.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 7,964 కేసులు నమోదు కాగా, 265 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,73,763కి చేరింది. మరో 86,422 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లోనే 11,264 మంది కోలుకోవడం ఊరట కలిగిస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories