కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. సగం పదవులు వారికే..!

Congress Bring in a Measure to Ensure 50 per cent Representation to Scheduled Castes
x

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. సగం పదవులు వారికే..!

Highlights

Congress: రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది.

Congress: రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో నిర్వహిస్తున్న పార్టీ చింతన్ శిబిర్ లో కీలక అంశాలపై కాంగ్రెస్ ముఖ్యనేతలు మంతనాలు జరుపుతున్నారు. పార్టీ పదవుల్లో 50 శాతం పదవులను ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనార్టీలకు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.

ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల చింతన్ శిబిర్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రెండో రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ తన భవిష్యత్ కార్యాచరణపై లోతుగా చర్చిస్తోంది. పార్టీలో సంస్థాగతమైన మార్పులను తీసుకురావడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు పార్టీ కీలకనేత ఒకరు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories