Citizenship: ముస్లిమేతర శరణార్థులకు దేశ పౌరసత్వానికి ఆహ్వానం

Citizenship of non Muslim Refugees Applications are Invited
x

Citizenship:(The Hans India)

Highlights

Citizenship: ముస్లిమేతర శరణార్థులకు దేశ పౌరసత్వం కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ధరఖాస్తులను ఆహ్వానించింది.

Citizenship: ముస్లిమేతర శరణార్థులకు దేశ పౌరసత్వం కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ధరఖాస్తులను ఆహ్వానించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌కు చెందిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు వంటి ముస్లిమేతరులు, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, హర్యానా, పంజాబ్‌లలోని 13 జిల్లాల్లో నివసిస్తున్నారు. వీరిని భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. 2019 లో అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కింద నిబంధనలు ఇంకా రూపొందించబడనప్పటికీ, పౌరసత్వ చట్టం 1955, 2009 లో చట్టం ప్రకారం రూపొందించబడిన నిబంధనల ప్రకారం ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

"పౌరసత్వ చట్టం 1955 (1955 లో 57) లోని సెక్షన్ 16 కింద ఇవ్వబడిన అధికారాల అమలులో సెక్షన్ 5 కింద భారత పౌరుడిగా నమోదు చేసుకోవటానికి లేదా సెక్షన్ కింద సహజీకరణ ధృవీకరణ పత్రం మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా అమలు చేయగల అధికారాలను నిర్దేశిస్తుంది. భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉన్నవారు ప్రస్తుతం గుజరాత్‌కు చెందిన మోర్బి, రాజ్‌కోట్, పటాన్, వడోదర, ఛత్తీస్‌గడ్‌లోని దుర్గ్, బలొదబజార్, రాజస్థాన్‌లోని జలోర్, ఉదయపూర్, పాలి, బార్మర్, సిరోహి, హర్యానాలోని ఫరీదాబాద్, జలంధర్ జిల్లాల్లో నివసిస్తున్నారు. భారత పౌరుడిగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేయవలసి ఉంటుందని నోటిఫికేషన్‌ల తెలిపారు.

2019 లో సిఎఎ అమల్లోకి వచ్చినప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా నిరసనలు జరిగాయి. ఈ నిరసనల నేపథ్యంలో 2020 ప్రారంభంలో ఢిల్లీలో అల్లర్లు కూడా జరిగాయి. 2014 డిసెంబర్ 31 వరకు భారతదేశానికి వచ్చిన బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్సీ, క్రిస్టియన్ నుంచి ముస్లింయేతర హింసకు గురైన మైనారిటీలకు భారత పౌరసత్వం సిఎఎ ఇవ్వబడుతుంది అని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories